ఈమె ఎవరు? వార్తలలోకి ఎందుకొచ్చింది?

ఫొటో జవాబు

ఏండ్ర్యూ స్ట్రాస్

సరైన సమాధానం ఇచ్చిన వారు:

karthik
karthikeya.iitk@gmail.com

ఈ క్రికెటర్ ఎవరు?

ఫొటో జవాబు

బైమా సీ-వైట్ హార్స్ బౌధ్ధ దేవాలయం, చైనా.భారతదేశం నుండి బౌధ్ధ సూత్రాలను ఇక్కడికి మొదటి సారి గుర్రాల మీద తెచ్చినందుకు ఆ పేరు పెట్టారు.ఇది చైనాలోని మొదటి బౌధ్ధ ఆలయం .

సినీ రంగం,సాంఘిక నేరాలు…

చాలా కాలం క్రితం నైనీ తాల్ లో నైనా కొలను ముందున్న మాల్ దగ్గర నేనూ, నా మిత్రుడు కూర్చుని ఉన్నాం.ఒక హిందీ చిత్రం షూటింగ్ జరుగుతోంది.ఒక రెటైర్డ్ కర్నల్ కుమార్తె అందులో హీరోయిన్.ఆయన మా ప్రక్కనే కూర్చుని చూస్తున్నాడు.అమ్మాయి స్విమింగ్ పూల్ లోంచి లేచి రావటం,హీరో గట్టిగా కౌగిలించుకుని నిలబడటం-ఇది దృశ్యం.ఈ సీను దాదాపు రోజంతా టేక్ అవుతోంది.అక్కడ జనం చుట్టూతా,చెట్ల మీదా సద్దుకుని చూస్తున్నారు. ఆమె పైకి రాగానే ఈలలు,కౌగిలించుకోగానే ఆకాశం దద్దరిల్లేలా గోల…మా ప్రక్కనున్నాయన అటూ ఇటూ చూడటం…నేను ఏమీ మాట్లాడకపోయినా ఎందుకో నా వైపు తిరిగి ‘ఇట్ ఈస్ ఎ గుడ్ మువీ…’,అన్నాడు!

రాత్రి అక్కడ ఆర్మీ వారు ఏర్పరచిన ఒక విందులో పాల్గొన్నాను. ఆ చిత్ర నిర్మాత కూడా వచ్చాడు.ఆ చిత్రం యూనిట్ అంతా ఉంది.సిగరెట్ పట్టుకుని ఒక ప్రక్కగా వచ్చి పలుకరించాడు.’మా చిత్రం  రివ్యూ వ్రాయాలి…’అన్నాడు.
‘అలాగే వ్రాస్తాను.ఎన్ని భాషలలో వ్రాయాలి?’
‘ఎన్ని భాషలలో వ్రాయగలరు?’
‘ఈ రోజు ఆ దిక్కుమాలిన సీను ఎన్ని గంటలు తీసారో అన్ని భాషలలో వ్రాయగలను!’
అటూ ఇటూ చూసాడు.
‘మరోలా అనుకోకండి.అలా చేయకపోతే మాకు స్పాట్ ఇవ్వరు ఈ ప్రాంతం వారు. మీకు మరో సంగతి చెబుతాను. అలా చెట్ల మీద, పుట్టల మీద ఉన్న వారంతా ఈ దళారీలకు డబ్బులిచ్చి ఉన్న వారు.మేము పాక్ అప్ అంటే మమ్మల్ని పాక్ చేసి పంపేస్తారు…’
ఎందుకో హీరోయిన్ తండ్రి మాకు దగ్గరగా వచ్చాడు.గ్లాస్ పైకి ఎత్తాడు.’ఇట్ ఈస్ ఎ గుడ్ మువీ…’అని గ్లాసు ఖాళీ చేసాడు!

~~~***~~~
మంచి బొమ్మే! ఒక మంచి బొమ్మ తీసి చూపించాలన్నా అతి నీచమైన ప్రక్రియలలోంచి తీసుకుని వెళ్లే వ్యవస్థ నేరాలకు పెద్దగా దూరంగా ఉండలేదని అందరికీ తెలిసిందే.నల్ల డబ్బు రొటేషన్,అనుదినం అడగకుండానే సరిక్రొత్త స్త్రీ సౌఖ్యం,అశ్లీలతను చిత్రీకరించి ఎడిటింగ్ పేరుతో కత్తిరించి ఆ ముక్కలను మరో చోటుకు వ్యాపారానికి పంపించటం…ఇవన్నీ ఇక్కడ  మామూలే. చిన్న కళాకారులు,అమ్మాయిలు,నాట్యాలలో పాల్గొనే వారు పడే అవస్థలతో నిండా నరకంలా కనిపించే వ్యవస్థ ఇది.డ్రగ్స్ గురించి వచ్చినది బాలీవుడ్ నుండి ప్రయాణిస్తున్న ఒక అలవాటు.ఇక్కడ కొత్తగా ఉంది.

2000 మందిలో ముప్పయి శాతం డ్రగ్స్ వ్యాపారంలో ఉండవచ్చని అంచనా.రోడ్ నంబర్ 3 బంజారా హిల్స్ లోంచి బయట పడ్డ వ్యవహారంలో నైజీరియా, ఉగాండా వారి లింకులు బయట పడ్డాయి.ఆయుధాల స్మగ్లింగ్,ఇతర నేరాలు డ్రగ్స్ ద్వారా తేలికగా సాగుతాయన్నది పోలీసు వర్గాల కథనం. ఇందులో నిజం  లేకపోలేదు.డ్రగ్స్ ద్వారా ఏడిక్ట్ అయిన వారు ఏ పనికైనా ఎందుకు చేస్తున్నారో ఆలోచించకు ండా సిధ్ధమవుతారు. అదో సులభమైన మార్గం.కొన్ని చోట్ల నార్కోటిక్ డ్రగ్స్ కు ‘హరహర మహాదేవ ‘ అనే పేరుంది.ఎక్స్టెసీ అనే డ్రగ్ అనౌష్క అనే పేరుతో,ఓపియం త్రిష పేరుతో,కొన్ని చీప్ గా వచ్చేవి ముమయిత్ పేరుతో చెలామణి అయిపోతున్నాయి.

ఇటీవల పబ్ కల్చర్ ఒక మ్హమ్మారిలా పాకింది.ఈ పబ్స్ ఎక్కువగా సినీ రంగం,రాజకీయరంగం వారు నడపటం ఒక విశేషం. పబ్స్ నుండి డ్రగ్స్ వైపుకు చాలా సింపుల్ గా హైదరాబాదు అభివృధ్ధి చెందింది.డప్యుటీ కమిషనర్ జె. సత్యనారయణ గారు ఒక మంచి పాయింట్ చెప్పారు. రియల్ ఎస్టేట్ నుండి సినీ రంగం లోకి వచ్చి డబ్బులు పెట్టి నష్ట పోయిన వారు ఈ వ్యాపారంలో ముందున్నారు.ముంబయి ఢిల్లీ నుంచి జయింట్ ఆపరేషన్స్ జరుపుతున్న వారి మీద విచారణ చేపడుతున్నారని ఎ.కె. ఖాన్ తెలుపుతున్నారు. ప్రముఖుల పిల్లలు, పేరు గల హీరోలు తప్పించుకోలేని విధంగా ఆధారాలను తెచ్చి లోపలికి తోస్తామని చెప్పటం కూడా విన్నాం.ఖాన్ గారి మాటను ప్రస్తుతానికి గౌరవించినా పాయింట్ బ్లాంక్ లో బులెట్లు పేల్చిన హీరోను ఏమీ చేయలేని పోలీసు వ్యవస్థ ఇంత చుట్టు తిరుగుడుగా సాగే నల్ల వ్యాపారాన్ని అరికట్టగలదనే నమ్మకం మటుకు కలగటం లేదు.

~~~***~~~

వ్యాపారం,సినీ పరిశ్రమ,రాజకీయాలు పెనవేసుకుని సాగే దేశం ఇది.ఫోర్త్ ఎస్టేట్ -మీడియా సామాన్యమైన పాత్రలో లేదు. సామాన్యులను మెంటల్ వారిలా తయారు చేసి తిరిగి ఈ మూడిటి ముందరా పీక్కు తినమని పడేస్తోంది మన మీడియా.ఈ నాలుగు దయ్యాలనూ నియంత్రించేందుకు సామాన్యులే పూనుకోవాల్సిన అవసరం ఉంది.

~~~***~~~

మాకూ సమాజం పట్ల బాధ్యత ఉంది,మేమూ సంఘజీవులం అంటూ సందేశాలిచ్చే వారు పైన ఉదహరించిన సినీ పోస్టర్ ను చూసి సిగ్గు తెచ్చుకోవాలి.ఈ వ్యవస్థలో ఉన్నవారి కుళ్లు ఆలోచనలలో ఏముందో ఇక్కడే కనిపిస్తుంది. యువత తోనే కదా ఈ వ్యాపారం ముడి బడి ఉన్నది? యువతే కదా మన భవిష్యత్తు?ఏది మన మార్గం?

~~~***~~~

మెక్సికో కాంగ్రెస్!

ఐ.టి పార్క్ లా ఉన్నది…

ఆస్ట్రియాలోని జైలు!

ఈ బౌధ్ధ ఆలయానికి గల ప్రాశస్త్యం ఏమిటి?

ఫొటో జవాబు

ఎనిడ్ బ్లైటన్

రాజ్యసభలోకి కొత్తగా వచ్చిన 55 మంది చరిత్రలు చూద్దాం…

పదమూడు రాష్ట్రాల నుంచి 55 మంది మహానుభావులు వెళ్లారు.పదిహేను మంది వారి అఫిడవిట్లలో వారి మీద నేరారోపణలు, విచారణలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.ఇటువంటి వారిలో ఎనిమిది మంది మీద గట్టి విచారణలు ఉన్నాయి.(హత్యలు,మానభంగాలు,ఫోర్జరీలు…)

అన్ని పార్టీలు సమానంగా ఈ తరహా అభ్యర్థులను ముందుకు పంపారు.వీరిలో కొందరు ప్రబుధ్ధుల పేర్లు చూద్దాం.ప్రొఫ్ .బఘేల్ సింగ్ (బి.ఎస్.పి)ఒక అటెంప్ట్ టు మర్డర్ కేసులో,డా.విజయ్ మాల్య కు రెండు ఫెరా కేసులు,రెండు చీటింగ్ కేసులు,గుండు సుధారాణి (టి.డి.పి)మీద మతం పేరిట గొడవ సృష్టించినందుకు రెండు కేసులు,రషీద్ (ఎస్.పి),డి.ఎం.కె నుంచి టి.ఎం. సెల్వగణపతి గారు మూడు కరప్షన్ కేసులలో ఉన్నట్లు తెలుస్తోంది.

విజయ్ మాల్య గారు 615 కోట్లు మాత్రమే ఆస్తుల క్రింద చూపించారు.తరువాత టి.డి.పి నుంచి యలమంచిలి సత్యనారాయణ చొదరీ గారు 189.7 కోట్లు చూపించారు.కన్వర్ దీప్ సింగ్ (జె.ఎం.ఎం) 82.6 కోట్లు చూపించారు.

కొత్తగా వచ్చిన రజ్యసభ సభ్యులలో 72% కోటీశ్వరులు.ఏవరేజ్ ఆస్తులు 23 కోట్లు తేలింది.అయిదుగురు అఫిడవిట్లలో పాన్ కార్డు నంబర్లు ఇవ్వలేదు. మరి ఎన్నికల కమిషన్ ఎలా ఒప్పుకుందో! ఒప్పుకోవచ్చని నియమం ఉందేమో చర్చించాలి.సామాన్యుడిని పాన్ నంబర్ లేకపోతే ఏ అప్లికేషనూ ఇవ్వనీయరు…

స్త్రీలకు పెద్దగా ప్రాతినిధ్యం లేదు.నలుగురు వచ్చారు. అంతే!

కానీయండి, సభలు మీవి,రాజ్యం మీది,కానీయండి!

~~~***~~~

Previous Older Entries

Follow

Get every new post delivered to your Inbox.