అమెరికా అఫ్ ఘాన్…ఎంత సేపు ముసుగులో గుద్దులాట?
31 జూలై 2010 వ్యాఖ్యానించండి
in వార్తాలాపం
వికిలీక్స్ వలన ఏమి అర్థమయిందో లేదో అలా ప్రక్కన పెడితే ఈ వీడియోలో చాలా విషయాలు మందుకొస్తాయి.
ఫోర్స్ 373 (అమెరికా సైన్యం లోని ఒక భాగం) ఒక రెయిడ్ జరిపినప్పుడు ఆ ఇంటిలో ఏడుగురు చిన్న పిల్లలు ప్రాణాలు కోలుపోయారు.’విదేశీయులు ‘మా గడ్డ మీద ఉండకూడదనే ఒక నినాదం పలు చోట్ల రగులుకున్నది.ఈ నినాదం తో అందరినీ ఆకట్టుకోవటం చాలా తేలికైన పని.అదే పాకిస్తాన్ కూడా చేస్తోంది.తాలిబాన్ దృష్టిలో పాకిస్తాన్ కీ, అఫ్ఘాన్ కీ మధ్య తేడా లేదు. రెండు చోట్ల నుండీ తాలిబాన్ విచ్చలవిడిగా ఆపరేట్ చేస్తోంది.పాకిస్తాన్ భారత్ అఫ్ఘాన్ లో చొరబడి ఆ దేశాన్ని చుట్టుముడుతున్నదనే ఒక మాటను ప్రచారం చేస్తోంది.
పాకిస్తాన్ అల్ కైదా కంటే అమెరికా వలన ఎక్కువ ముప్పు ఉన్నదని భావించటం గమనార్హం!పాకిస్తాన్ ప్రస్తుతం అమెరికాకి ఒక సన్నిహితుడిగా తీవ్రవాదం మీద యుధ్ధం చేయటం లేదు. అది సమస్యలో ఒక భాగమై కూర్చుంది.అఫ్ఘాన్ లోని పష్తూన్ తెగల మధ్యలోకి వెళ్లి తలిబాన్ వారి ‘జాతీయత ‘ ను అడ్డం పెట్టుకుని ప్రస్తుతం ఆడుకుంటోంది.ఈ వీడియోలో ఒక సైనికుడు పాకిస్తాన్ చెక్ పోస్ట్ ను చూపించి తాలిబాన్ దాడి చేసినప్పుడల్లా ఆ చెక్ పోస్ట్ నుండి పాకిస్తానీ సైనికులు కూడా కలసి దాడి చేస్తారని చెప్పటం మనకు కనిపిస్తుంది.
పాకిస్తాన్ తాలిబాన్ ను చాలా తెలివిగా వాడుకుంటోంది.జాతీయత, జిహాద్,విదేశీయుల దురాగతాలు, ‘భారత్ బూచి ‘ అనే అంశాలను నేపథ్యంగ పెట్టి డబల్ గేం తో చెలామణి అయిపోతోంది.కశ్మీర్ ను అలవోకగా కలిపేసింది…
అమెరికా తన టౄప్ లను పెంచి ఉపయోగం?
దీనికి పరిష్కారం సైనిక చర్య కాదు.ఏ ప్రాంతంలోనైనా ఏ దేశం యొక్క సైన్యం దిగినా (ఐ.పి.కె.ఎఫ్ అయినా అంతే!)స్థానిక ప్రజలలో ఒక అసంతృప్తి, అసహనం సామాన్యమే.సైనికులకు నిగ్రహంతో వ్యవహరించే తత్వం అరుదు. మన దేశంలోనే చాలా సార్లు ఈశాన్య రాష్ట్రాలలో జరిగినవి మనం మరచిపోలేదు.
ఒక రాజకీయపరమైన సమాధానం వైపు అమెరికా భరత్ తో కలసి వెళ్లాలి.ఈ ప్రక్రియలో కీలకమైన దేశాలను కలుపుకోవటం మంచిది.
పాకిస్తాన్ లోని అణు ఆయుధాలు తాలిబాన్ చేతిలోకి వెళ్లే ముందైనా అఫ్ఘాన్ కీ, పాకిస్తాన్ కీ మధ్య తేడా లేదని తెలుసుకోలేని అమెరికా కళ్లు తెరిస్తే బాగుంటుంది.
ఇరాక్, అఫ్ ఘాన్ లలో అమెరికా సాధించింది ఏమీ లేదు.వారి సైన్యంలోని మృతుల సంఖ్య చూస్తే బాధగా ఉంటుంది.
Bishop Tutu had once said, ” There are times when it would have been justifiable to go to war,but only after you have genuinely exhausted every other possible option.You have to say with reasonable certainty that the struggle will be successful and that the circumstances are going to be better…and of course you have to use the principle of proportionality-that the violence or force you use is in proportion to the end that you wish to achieve.”
చేతనైతే ఒక బృహత్ పథకాన్ని పన్ని ఆ దేశం అణు ఆయుధాలను అంతర్రాష్ట్రీయ పర్యవేక్షణలో స్వాధీనం చేసుకుని ముక్కుకు తాడు వేయగలగాలి.మిగతా పనులు ఉపయోగం లేనివి!
ఒక నీచమైన వృత్తికీ, ప్రవృత్తికీ అలవాటయిపోయిన పాకిస్తాన్ లాంటి దేశం కింద పడ్డా పై చేయి మాదే అనే సామెతను ఋజువు చేస్తుంది.ఆ ప్రక్రియలో భాగంగా దేనికైనా తెగించగలదు.అందులో అమాయకులను బలి చేయటం మూర్ఖత్వమే అనిపించుకుంటుంది…
~~~***~~~
ఫొటో జవాబు
31 జూలై 2010 వ్యాఖ్యానించండి
in శ్రీ-సరదాలు!
అందం కోసం,ఎక్కువ కాలం బ్రతకటం కోసం మైకెల్ జాక్ సన్ ఈ ఆక్సిజన్ చేంబర్ లో నిదురించేవాడు.దీనిని కేలిఫార్నియా మెడికల్ సెంటర్ కు ఇచ్చేసాడు.
సరైన జవాబిచ్చిన వారు:
swapna@kalalaprapancham
welcome2dreamzworldmaster@gmail.com
jokabhiramayanam.blogspot.com
satyaonline@gmail.com
Observer
lndurvasula@gmail.com
ఒంటరిగా…
27 జూలై 2010 1 వ్యాఖ్య
in వార్తాలాపం
చాలా దేశాలలొ ఒకప్పుడు ఒంటరిగా సినిమాకి వెళ్లినా, హోటల్ కు వెళ్లినా కొద్దిగా అవమానకరంగానే ఉండేది.రోజులు మారిపోతున్నాయి. కొరియాలో ఇటీవల ఒంటరి వారికోసం ప్రత్యేకమైన హోటళ్లు తయారయినాయి. ఒక కర్టెన్, ఒక పార్టిషన్,సన్నని సంగీతం, లాప్టాప్ కోసం సౌకర్యం, తిండి…ఇలా అంతా నిశ్సబ్దం అంతటా చోటు చేసుకుంటోంది.ఆసియా ఖండంలో ప్రజలు ఎక్కువగా ఒంటరితనాన్నే కోరుకుంటున్నారని తెలుస్తోంది.
ముంబయి నగరంలో వివాహాలనేవి తగ్గి ‘లివ్ ఇన్ ‘ సంబంధాలు పెరిగాయి…
ఒక లాప్ టాప్ ద్వారా ప్రపంచమంతా చేతిలోకి వచ్చింది.మిగిలింది నన్ను కాకుండా లెక్క వేసుకో!
ఇలియట్ మంచి మాట అడిగాడు.
Where is the knowledge we have lost in the pursuit of information?
Where is the wisdom we have lost in the pursuit of knowledge?
Where is the life we have lost in the pursuit of a living?
సిరివెన్నెల గారి మాట గుర్తుకొస్తుంది…జగమంత కుటుంబం నాది (ఇంటర్ నెట్ నా చేతిలో).ఏకాకి జీవితం నాది (నన్ను కాకుండా లెక్కేసుకో!)
ఇది మంచి విషయం కాదు.
~~~***~~~
ఫొటో జవాబు
27 జూలై 2010 వ్యాఖ్యానించండి
in శ్రీ-సరదాలు!
ప్రైమరీ నుండి యూనివర్సిటీ వరకు 35డాలర్ల ధరకు పంచాలనుకుంటున్న లాప్ టాప్స్.
సరైన సమాధానం ఇచ్చిన వారు:
అరిపిరాల
jokabhiramayanam.blogspot.com
జయంత్ కుమార్
jayanthalerts@gmail.com
‘ఎడ్యుకేషన్-మై పర్సెప్షన్’-శ్రీ జయంత్ మునిగల గారి పుస్తకం
26 జూలై 2010 1 వ్యాఖ్య
in శ్రీ-విద్య
1986 లో ఐ.ఎ.ఎస్ లో చేరిన జయంత్ మునిగల గారు చాలా అనుభవం గడించారు.ఈ పుస్తకం కేవలం వారు అనుకున్న దృక్పథం గురించి కాదు.విద్య అనే అంశం విధానాలమధ్య, విధి వ్రాత అడుగున,విధాత పెట్టిన విధి వేధింపుల మరుగున తర తరాలుగా అలా మార్పులకు గురీవుతూ వస్తోంది.ముఖ్యంగా దీనిని ప్రశాసనంలో భాగమై చాలా దగ్గరగా పరిశీలించి కొన్ని నిజాలను పుస్తకరూపంలో చెప్పారు మునిగల గారు.
ఆయన చిన్నప్పుడి అదిలాబాద్ జిల్లాలో చదువుకున్న వ్యవహారం నుంచి ఈ నాటి విద్యారంగంలోని అంశాలను చెప్పారు.ప్రాథమిక విద్యావిధానాల లో సంకల్ప బలం లోపించటం వలన వాటి అమలులో ఎన్ని సమస్యలుంటాయో బాగా ఉదాహరణలతో చూపించారు. ముఖ్యంగా జార్ ఖండ్ లో ఒక్క ఉపాధ్యాయుని సహాయంతో బడులు నడిపించటం లాంటివి ఆలోచింపచేస్తాయి.
విద్యావిధానంలో అటకెక్కిన భాష మీద దృష్టిని ఆయన ప్రారంభంలోనే పునరుధ్ధరించారు.తరువాత చరిత్ర (హిస్టరి)ను పట్టుకోమన్నారు.శబ్దం-శబ్దబ్రహ్మము యొక్క మరో స్వరూపమే భాష.ఆలోచనను అలవోకగా అలంకరించేదే భాష. ఆలోచన నుంచే ఆత్మశోధన.ఆత్మశోధనకు అంకురార్పణ చరిత్రలో ంచే జరుగుతుంది.మనం నిలబడింది ఎక్కడో నిలబడం.మన వెనుక నిలబడ్డ చరిత్ర అనే నేపథ్యం ముందు దాని ప్రతినిధిగా నిలబడతాం.తరువాత లెక్కలలోకి వెళ్లమన్నారు.అంటే లెక్కలు వేసుకోమన్నారు.తరువాత విఙ్ఞానం లోకి రమ్మన్నారు.సమస్తం విఙ్ఞానం ద్వారా పరికించి చూడమన్నారు.శారీరిక స్వస్థత గురించి చిన్నప్పటినుండే చూడమంటున్నారు.
ఇలా చెప్పుకొస్తూ చాలా దేశాలలో విద్య అనే విషయంలో జరుగు ప్రక్రియలను చిన్నగా స్పృశించారు. వారి ఆలోచనలో ఒకటి నుండి నాలుగో తరగతి వరకు మొదటి దశ. ఇందులో భాషలు, గణితం ప్రధానంగా నేర్చుకోవాలన్నారు.సంస్కృతం మూడో భాషగా అధ్యయనం చేయమన్నారు. రెండవ దశ అయిదు నుండి ఏడవ తరగతి వరకు. ఇందులో హిస్టరీ,విఙ్ఞానం కలపాలి. అలాగే భాషల స్థాయి పెరిగి గ్రామర్ తప్పులు లేకుండా మాట్లాడటం వ్రాయటం గట్టి పడాలన్నారు.మూడవ దశ ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి వరకు.ఇందులో అన్నిటి స్థాయిని రాబోయే చదువులను అందుకునేలా పెంచమన్నారు!
వినటానికి చాలా సింపుల్ గా ఉంది.ఆలోచిస్తే అర్థమవగలదు.
మా ఇంటి వెనుక ఒక విద్యాలయం ఉంది.ప్రతి రోజూ అసెంబ్లీలో పిల్లలు ఏవో చదువుతూ ఉంటారు.
‘అవర్ రిచ్ అండ్ వేరీడ్ హెరిటేజ్ ‘అని చదివేటప్పుడు మైకు ముందు ఆ అమ్మాయి ‘…రిచ్ అండ్ వరీడ్ హెరిటేజ్ ‘అంటుంది. రోజూ అలానే చదువుతుంది.అధ్యాపకులు, ప్రధాన అధ్యాపకులు అలానే వింటూ ఉంటారు…ఇది తప్పు కాదు! మన హెరిటేజ్ నిజంగా వరీడ్ గానే ఉంది!!!
మునిగల గారి పాయింటు ఇప్పుడింకా అర్థమవుతుంది.
ఈ పుస్తకం చాలా చిన్నది.చాలా పెద్ద ఫాంటులో 111 పుటలు.ధర 116 రూపాయలు మాత్రమే!
ఈ పుస్తకాన్ని పాలపిట్ట పబ్లికేషన్ వారు ఇటీవల ప్రచురించారు.
ప్రతులు దొరకు చోటు:
Paalapitta Books
16-11-20/6/1/1
403 Vijayasai Residency
Saleemnagar
Malakpet
Hyderabad-500 036
Ph: 9848787284
paalapittabooks@gmail.com
Writer can be contacted at 09652044903, munigala2001@yahoo.com
~~~***~~~









ఇటీవలి అభిప్రాయములు