‘మై నేం ఈస్ ఖాన్…’హిందీ చలన చిత్రం మీద వేదాంతం శ్రీపతిశర్మ కబుర్లు

వార్తలు చూస్తూ వీటి మీద ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుంది అనుకోవటం వేరు,ఒక కాన్సెప్ట్ ను ఎంచుకుని కథలో దానిని ఘటింపచేయటం వేరు.వీటికి తేడా తెలియని వారు తెలుసు అనుకుని తీసిన చిత్రం ఇది.
రిజ్వాన్ ఖాన్ (షాహ్ రుఖ్) అటిసం (ఒక మానసిక ప్రవృత్తి) తో బాధ పడుతున్న వ్యక్తి.తన తమ్ముని దగ్గరకు (అమెరికా) చేరుకుని అతని ప్రాడక్టులను అమ్మటానికి సేల్స్ మన్ గా చేరుతాడు.మందిరా(కజోల్)కు దగ్గరయి వివాహమాడతాడు.కజోల్ కి అప్పటికే ఒక పిల్లవాడు ఉంటాడు.అమెరికాలో జరిగిన ట్రేడ్ సెంటర్ అటాక్ ల తరువాత ఆ దేశంలో మహమ్మదీయుల పట్ల వారు కనపరచిన ద్వేషాన్ని దర్శకుడు ఇతివృత్తంగా ఎంచుకున్నాడు అని చెప్పటానికి ప్రేక్షకులను తేరగా ఎంచుకున్నట్లు కనిపిస్తుంది.అది ఇద్దరి ప్రేమ వ్యవహారంతో అతి కష్టంతో ముడి పెడతాడు.ఆ ముడికి సినిమా యావత్తూ వ్రేలాడి,సాగి, సాగి చివరకు కనీసం పది సార్లు టైం ఎంత అయింది అని చూసుకోమన్నాడు దర్శకుడు.
సామాన్యంగా షాహ్ రుఖ్ సినిమాలలో ఒక వేగం, ఒక జీవ కళ మనం చూస్తాం. పాపం ఆయన ఇలా సాగిపోవటం కొంత బాధే మిగిల్చింది. అమెరికా అధ్యక్షుని కలుసుకుని ‘మై నేం ఈస్ ఖాన్, అయాం నాట్ ఎ టెరరిస్ట్.’ అని చెప్పమంటుంది కజోల్.నీ వల్లనే కుర్రాడు చంపబడ్డాడని(తండ్రి మహమ్మదీయుడైనందుకు).ఆ ప్రయత్నంలో అతను ఎక్కడెక్కడో తిరిగి ఒక బీద పల్లెలో వరదలో సహాయ చర్యలు లేని పరిస్థితిలో ఇతను అక్కడికి చేరుకుని మహమ్మదీయులందరినీ ఏకం చేయగలిగి వారిని ఉధ్ధరించి ఒక తీవ్రవాదిని పట్టించి చివరకు హాలీవుడ్ లో అమెరికా అధ్యక్షుని పర్యటనలో ఆయనే స్వయంగా రిజ్వాన్ ను పిలచి మాట్లాడగా ‘మై నేం ఈస్ ఖాన్..’ అంటాడు! ఆ బాధలో పాపం షాహ్ రుఖ్ ‘మై నేం ఈస్ షాహ్ రుఖ్, అయాం నో లాంగర్ ఎ స్టార్…’అంటాడేమోననిపించింది!
షాహ్ రుఖ్ ‘రెయిన్ మాన్ ‘ చిత్రంలోని డస్టిన్ హాఫ్ మాన్ నుంచి బాగానే ఈ ‘ఆటిసం ‘ ప్రవృత్తికి గల మేనరిసం ను అవలంబించినట్లు కనిపిస్తుంది.కాకపోతే షాహ్ రుఖ్ సహజ నటుడు కాబట్టి ఆ పాత్రలో కూడా కొంత వైవిధ్యం తెచ్చాడు. ముఖ్యంగా ఒక చిన్న నవ్వు చేర్చి అదే సమయంలో కనుపాపలను దగ్గరకు తేవటం అంత తేలిక కాదు.ఆయన ప్రతిభను దర్శకుడు (కరణ్ జోహర్), స్క్రిప్ట్రైటర్ (శిబనీ భతీజా)కలసి చాలా జాగ్రత్తగా బూడిదలో పోశారనే చెప్పాలి. శిబాని భతీజా,నిరంజన్ ఐయంగార్ వ్రాసిన మాటలు కొద్దిగా చిత్రాన్ని నిలబెట్టాయి.
కథాంశం మంచిదైనా సినిమా ఎందుకు విఫలమవుతుంది అనేందుకు కథ పట్ల, ట్రీట్మెంట్ పట్ల సమగ్రమైన, సమతుల్యమైన అవగాహన లేకపోవటమే కారణమని చెప్పాలి. జరీనా వహాబ్ సినిమా ప్రారంభంలో షాహ్ రుఖ్ కు చెబుతుంది-లోకంలో రెండు రకాల మ్నుషులే!ఒకడు మంచి వాడు, రెండు చెడ్డ వాడు. ఆందరూ మనుషులే! నిజమే! కథాంశంలో వాస్తవం ఉన్నప్పటికీ ఈ సరైన అధ్యయనం,ఘటనాత్మకమైన తీరు తెన్ను లేనప్పుడు సినిమాలలో రెండే రకాలు మిగులుతాయి-మంచివి,పిచ్చివి…
~~~***~~~
ఒక పెద్దాయన ఇదంతా విని ఒక సవాలు విసిరారు. ఇదే కథాంశం ఆకట్టుకునే విధంగా ఎలా చేయవచ్చు అని!
నాకేమి తెలుసు? నేను సినిమా చూసి నా అనుభూతిని చెప్పాను. అంత మటుకే!
తప్పించుకుంటున్నారు అన్నారాయన.
‘ద టర్మినల్ ‘ చిత్రం చూసి కథ ఎక్కడ మొదలయిందో చెప్పండి, అన్నాను.ఒక మామూలు మనిషి అక్కడ ఇరుక్కున్నాడు.విధానాలు, సమస్యలు,దేశ విదేశ సంబంధాలు,నానా సమస్యలను అక్కడే చూపించేశాడు దర్శకుడు!
ప్రేక్షకుడు 9/11 ను లింకు చేసి మన హీరోను చూడాలంటే తెర మీద ఒక అమెరికాలో నివసిస్తున్న మహమ్మదీయుడు ఆ సంఘటనలో ఇరుక్కున్న వడిగా కనిపించాలి.తెర మీద ఈ సినిమాలో ఇది జరగకపోవటం ముందు చెప్పిన మాటను గుర్తు చేస్తుంది…వార్తలు చూస్తూ వీటి మీద ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుంది అనుకోవటం వేరు,ఒక కాన్సెప్ట్ ను ఎంచుకుని కథలో దానిని ఘటింపచేయటం వేరు.వీటికి తేడా తెలియని వారు తెలుసు అనుకుని తీసిన చిత్రం ఇది.
~~~***~~~

‘సర్కసు డేరా’-మధురాంతకం రాజారాం గారి కథ,వేదాంతం శ్రీపతిశర్మ కబుర్లు

ఈ కథ 1958లో ఆంధ్రపత్రిక ఉగాది సంచికలో ప్రచురితమైనది.రాజారాం గారి సాహిత్య అకాడమీ పొందిన(1994) కథల సంకలనంలో మొదటి కథ.
ఊరి చివర ఒక సర్కసు చూడటానికి రచయిత వెళతాడు.అక్కడ గతంలో తన పది రూపాయలు ఎత్తుకుపోయాడనుకున్న నాగులు టికట్టులు తీస్తుండగా చూసి వాడిని ఒక టికట్టు కొనమని చెబుతాడు.అతను అతి కష్టంగా ఒక రేకును పట్టుకుని కొన్ని టికట్టులు తీసుకుని ఎక్కువకు అమ్మటం మొదలు పెడతాడు. ఒక పావళా ఎక్కువ ఇచ్చి కొనుక్కుని సర్కసు చూస్తాడు రచయిత.
సరక్సులో ఆ జంతువుల విన్యాసాలు,బాధలు,కత్తి మీద సాము వంటి ఆ మనుషుల పనులు,ఇటు నాగులు జీవితం,అతని తండ్రి మరణించిన తీరు,చివరకు ఒక సింహం నోటిలో మేక పిల్ల తల దూర్చినా అది చంపకుండా నోరు తెరచి ఉండటం,ఈయన ఆశ్చర్యపోవటం,అదేమిటి ఆ మేక పిల్లకు అంత నమ్మకమా అని అడిగినప్పుడు నాగులు ‘అవి జంతువులు ‘ అని
చెప్పటం …ఇవి కథలోని అంశాలు.
కథలో జీవన పోరాటాన్ని ఒక సర్కసు వ్యవహారంతో పోల్చటం జరిగింది.బావిలోకి దిగి మట్టి తీసే వారు,నిచ్చెనలెక్కి పైన  ఇటుకలు మోస్తున్న కూలీల జీవితాలు,సర్కసులో విన్యాసాలు,అక్కడ క్రూర జంతువుల మధ్య సాగిపోతున్న సర్కసు కంపనీలోని మనుషులు,ఒక స్త్రీ నిలబడి ఉన్నప్పుడు ఆమెకు తగలకుండా విసురుతున్న కత్తులు…ఇలా హృద్యమైన కథనం పలు చోట్ల హాస్యంతో సాగినా పలు వృత్తులలో జీవన పోరాటం సాగిస్తున్న వారి మీద, మానవులకు ఒక యుధ్ధం లేనిదే జీవితం లేదనే ఆలోచన వలన కరుణ కలుగక మానదు.
గతంలో నాగులు మీద అపనమ్మకంతో ఆ పది రూపాయలూ పోతాయనుకుని వెంట పడినప్పుడు అతను ఎక్కడి నుండో చిల్లర తెచ్చి చేతిలో పెడతాడు. దానికి సిగ్గు పడతాడు రచయిత.ఆ ఘట్టాన్ని చివరికి సర్కసు లో నాగులు తన కాలుకు దెబ్బ తగిలించుకుని టికట్లు సంపాదించి కొంత సంపాదించి ప్రక్కన కూర్చున్నపుడు మరల ప్రస్తావించటం జరుగుతుంది.’అవి జంతువులు కాబట్టి ఆ నమ్మకం ‘ అన్న మాటతో రచయితకు దెబ్బ తగిలినట్లవటంతో కథ ముగుస్తుంది.
కథనం తమాషాగా ఉంటుంది.కథలోని సారాని ఏ పాత్ర ద్వారా చెప్పాలనుకున్నారో ఆ పాత్ర కథలో ముందే ప్రవేశించదు.అంటే ప్రక్రియకు గల నేపథ్యం రచయిత స్వగతంతో ప్రారంభమయ్యి ఒక సహజమైన పాత్ర ఎదురు పడటం జరుగుతుంది కానీ ఆ పాత్ర కథలోకి దూరదు.పఠకుడు అక్కడ అప్పటికే ఉన్న విషయాన్ని ఈ విధంగా గుర్తిస్తాడు. రచయిత గుర్తు చేస్తాడు. కథ అయిపోతుంది!
పోలికను పాఠ్యాంశంగా చెప్పకపోవటం గొప్ప రచయితల లక్షణం.అది వృత్తం తిరిగిన తరువాత బుర్రలో గిర్రున తిరుగుతుంది.మరో సారి తిరిగినప్పుడు మరో ఆలోచన కలుగుతుంది…
~~~***~~~
ఈ కథలోని కొన్ని వాక్యాలు ఆకట్టుకుంటాయి:
‘ చేసిన పాపం చెబితే పోతుందంటారు.ఇలా సర్కసుకు వెళ్లి పట్టణంలో దిగబడిపోయిన అసంఖ్యాక ప్రజాసమూహంలో నేనూ ఓడిని!’
‘ఒక్క వ్యాపారంలోనే ఏమిటి? ఈ వ్యాపారాలూ,విద్యలూ,భోగాలూ,భాగ్యాలూ,నాటకాలూ, బూటకాలూ,దేనికైతే అవసరమవుతున్నాయో ఆ బ్రతుకే రెండు విధాలుగా ప్రస్తరిల్లిపోతున్నది.ఒకటి, ప్రవాహ గతిని అనుసరించి, అశ్రమంగా, అదొక వినోదంలా పడవ నడపటం,రెండు, చేతుల బలంతో అంతకంతకూ తరిగిపోతున్న శరీర దారుఢ్యంతో ఏటికెదురీదటం!’
‘ఆలోచనకు తెరపి ఇవ్వకుండా అనుభూతే మానసాకశమంతా క్రమ్ముకున్నప్పుడు నియమాలు నిలవవు.ఆ స్థితిలో ఎవరికైనా మైమరుపు కలుగుతుంది.’
‘తీసుకో, తీసుకో ‘ అని కుర్రవాడిని వూరించి, వాడు దగ్గరకి వచ్చే లోపుగానే మనం దాచి పెట్టుకునే తినుబండారంలా అంతలో మృత్యుదేవత చిక్కి బిక్కరించబోయి, ఇంతలో దూరంగా వెళ్లి వెక్కిరించటమేనా మానవ జీవితం?’
ఎంత నిజం?!
~~~***~~~

ఈ కథ 1958లో ఆంధ్రపత్రిక ఉగాది సంచికలో ప్రచురితమైనది.రాజారాం గారి సాహిత్య అకాడమీ పొందిన(1994) కథల సంకలనంలో మొదటి కథ.
ఊరి చివర ఒక సర్కసు చూడటానికి రచయిత వెళతాడు.అక్కడ గతంలో తన పది రూపాయలు ఎత్తుకుపోయాడనుకున్న నాగులు టికట్టులు తీస్తుండగా చూసి వాడిని ఒక టికట్టు కొనమని చెబుతాడు.అతను అతి కష్టంగా ఒక రేకును పట్టుకుని కొన్ని టికట్టులు తీసుకుని ఎక్కువకు అమ్మటం మొదలు పెడతాడు. ఒక పావళా ఎక్కువ ఇచ్చి కొనుక్కుని సర్కసు చూస్తాడు రచయిత.
సరక్సులో ఆ జంతువుల విన్యాసాలు,బాధలు,కత్తి మీద సాము వంటి ఆ మనుషుల పనులు,ఇటు నాగులు జీవితం,అతని తండ్రి మరణించిన తీరు,చివరకు ఒక సింహం నోటిలో మేక పిల్ల తల దూర్చినా అది చంపకుండా నోరు తెరచి ఉండటం,ఈయన ఆశ్చర్యపోవటం,అదేమిటి ఆ మేక పిల్లకు అంత నమ్మకమా అని అడిగినప్పుడు నాగులు ‘అవి జంతువులు ‘ అని చెప్పటం …ఇవి కథలోని అంశాలు.
కథలో జీవన పోరాటాన్ని ఒక సర్కసు వ్యవహారంతో పోల్చటం జరిగింది.బావిలోకి దిగి మట్టి తీసే వారు,నిచ్చెనలెక్కి పైన  ఇటుకలు మోస్తున్న కూలీల జీవితాలు,సర్కసులో విన్యాసాలు,అక్కడ క్రూర జంతువుల మధ్య సాగిపోతున్న సర్కసు కంపనీలోని మనుషులు,ఒక స్త్రీ నిలబడి ఉన్నప్పుడు ఆమెకు తగలకుండా విసురుతున్న కత్తులు…ఇలా హృద్యమైన కథనం పలు చోట్ల హాస్యంతో సాగినా పలు వృత్తులలో జీవన పోరాటం సాగిస్తున్న వారి మీద, మానవులకు ఒక యుధ్ధం లేనిదే జీవితం లేదనే ఆలోచన వలన కరుణ కలుగక మానదు.
గతంలో నాగులు మీద అపనమ్మకంతో ఆ పది రూపాయలూ పోతాయనుకుని వెంట పడినప్పుడు అతను ఎక్కడి నుండో చిల్లర తెచ్చి చేతిలో పెడతాడు. దానికి సిగ్గు పడతాడు రచయిత.ఆ ఘట్టాన్ని చివరికి సర్కసు లో నాగులు తన కాలుకు దెబ్బ తగిలించుకుని టికట్లు సంపాదించి కొంత సంపాదించి ప్రక్కన కూర్చున్నపుడు మరల ప్రస్తావించటం జరుగుతుంది.’అవి జంతువులు కాబట్టి ఆ నమ్మకం ‘ అన్న మాటతో రచయితకు దెబ్బ తగిలినట్లవటంతో కథ ముగుస్తుంది.
కథనం తమాషాగా ఉంటుంది.కథలోని సారాని ఏ పాత్ర ద్వారా చెప్పాలనుకున్నారో ఆ పాత్ర కథలో ముందే ప్రవేశించదు.అంటే ప్రక్రియకు గల నేపథ్యం రచయిత స్వగతంతో ప్రారంభమయ్యి ఒక సహజమైన పాత్ర ఎదురు పడటం జరుగుతుంది కానీ ఆ పాత్ర కథలోకి దూరదు.పఠకుడు అక్కడ అప్పటికే ఉన్న విషయాన్ని ఈ విధంగా గుర్తిస్తాడు. రచయిత గుర్తు చేస్తాడు. కథ అయిపోతుంది!
పోలికను పాఠ్యాంశంగా చెప్పకపోవటం గొప్ప రచయితల లక్షణం.అది వృత్తం తిరిగిన తరువాత బుర్రలో గిర్రున తిరుగుతుంది.మరో సారి తిరిగినప్పుడు మరో ఆలోచన కలుగుతుంది…
~~~***~~~
ఈ కథలోని కొన్ని వాక్యాలు ఆకట్టుకుంటాయి:
‘ చేసిన పాపం చెబితే పోతుందంటారు.ఇలా సర్కసుకు వెళ్లి పట్టణంలో దిగబడిపోయిన అసంఖ్యాక ప్రజాసమూహంలో నేనూ ఓడిని!’
‘ఒక్క వ్యాపారంలోనే ఏమిటి? ఈ వ్యాపారాలూ,విద్యలూ,భోగాలూ,భాగ్యాలూ,నాటకాలూ, బూటకాలూ,దేనికైతే అవసరమవుతున్నాయో ఆ బ్రతుకే రెండు విధాలుగా ప్రస్తరిల్లిపోతున్నది.ఒకటి, ప్రవాహ గతిని అనుసరించి, అశ్రమంగా, అదొక వినోదంలా పడవ నడపటం,రెండు, చేతుల బలంతో అంతకంతకూ తరిగిపోతున్న శరీర దారుఢ్యంతో ఏటికెదురీదటం!’
‘ఆలోచనకు తెరపి ఇవ్వకుండా అనుభూతే మానసాకశమంతా క్రమ్ముకున్నప్పుడు నియమాలు నిలవవు.ఆ స్థితిలో ఎవరికైనా మైమరుపు కలుగుతుంది.’
‘తీసుకో, తీసుకో ‘ అని కుర్రవాడిని వూరించి, వాడు దగ్గరకి వచ్చే లోపుగానే మనం దాచి పెట్టుకునే తినుబండారంలా అంతలో మృత్యుదేవత చిక్కి బిక్కరించబోయి, ఇంతలో దూరంగా వెళ్లి వెక్కిరించటమేనా మానవ జీవితం?’
ఎంత నిజం?!
~~~***~~~

Follow

Get every new post delivered to your Inbox.