30 ఏప్రిల్ 2009-గ్రహాలు ఎలా ఉన్నాయి?
29 ఏప్రి 2009 వ్యాఖ్యానించండి

30 ఏప్రిల్ 2009-ఈ రోజున 107 నియోజక వర్గాలలో కీలకమైన ఎన్నికలు జరుగనున్నాయి. ముఖ్యంగా గుజరాత్, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ , బిహార్, కర్ణాటక, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ ఇలాంటి చోట కీలకమైన పోలింగు ఉంటుంది. దీనితో 372 నియోజక వర్గాలలో ఎన్నికలు ముగుస్తున్నట్లే!
పంచాంగం ఇలా ఉంది-స్వస్తిశ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర వైశాఖ శుధ్ధ షష్ఠి,గురువారం, పునర్వసు నక్షత్రం, ధృతి యోగం, తైతుల కరణం.
కర్ణాటక :
గురు, శని, బుధ, చంద్రులు ప్రధానంగా రాణిస్తున్నారు. దేహాంతర్దశలు చూద్దాం:
5.55-10.56 గురువు
10.56-4.54 శని
4.54- బుధుడు
ఈ రోజు శుక్రుడు, గురువు, శని, బుధుల వలన పారిజాత యోగం ఏర్పడినది. వీటిలో ఎప్పటి లాగే మరల శని చేతి లోకి పగ్గాలు తీసుకున్నాడు.
ఉదయం 11 వరకు అధికార పార్టీకి ఎక్కువ శాతం పోలింగు జరగ వచ్చు. ఆ తరువాత వైపరీత్యం కనిపిస్తున్నది. మధ్యాహ్నం మూడు గంటల సమయానికి కొన్ని అవాంచనీయమైన సంఘటనలు జరుగవచ్చును. జె. డి.ఎస్ తన పరిస్థితి మెరుగు పరచుకో గలదని ఒక సూచన ఉన్నది.
దక్షిణ కర్నాటకలో కాంగ్రెస్ కు లాభాలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ రోజు యావత్తూ అధిక శాతం గురు ప్రభావం, శని ప్రభావం కనిపించుట వలన ఆ పార్టీ అనుకున్నంత మంచి పరిణామాలు సాధించలేక పోవచ్చును.
స్వతంత్ర అభ్యర్థులు ముందుకు రానున్నారు!
గుజరాత్ గురించి తరువాయి టపాలో చర్చిద్దాం…
ఇటీవలి అభిప్రాయములు